బాలీవుడ్ (Bollywood)లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో టాప్ ప్లేస్లో ఉంటాడు స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor). ఉడ్తా పంజాబ్, కబీర్ సింగ్తోపాటు మరెన్న చిత్రాల్లో తన యాక్టింగ్తో అదరగొట్టేశాడు ఈ హీరో. అయితే చాలా ఆశలు పెట్టుకున్న జెర్సీ చిత్రం మాత్రం బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఎన్నో అంచనాలు, వాయిదాలు, ఒడిదుడుకుల మధ్య విడుదలైన ఈ చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే షాహిద్ కపూర్ మాత్రం అబ్బాస్ అలీ జాఫర్ (Abbas Ali Zafar) డైరెక్షన్లో యాక్షన్ సినిమాకు సైన్ చేశాడు.
కాగా ఈ ప్రాజెక్టుకు షాహిద్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ (Remuneration) ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సినిమా హిట్టు, ఫ్లాప్తో సంబంధం లేకుండా పారితోషికం విషయంలో మాత్రం తగ్గేదే లే అనే ఫార్ములాను అప్లై చేస్తున్నాడట షాహిద్ కపూర్. తాజా చిత్రానికి రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడని టాక్. జెర్సీ చిత్రానికి రూ.35 కోట్లు తీసుకున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టినా..అవేం పట్టికోకుండా షాహిద్ పారితోషికం పెంచడం హాట్ టాపిక్గా మారింది.
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే మేకర్స్ షాహిద్కపూర్పై చాలానే నమ్మకం పెట్టుకున్నారని అర్థమవుతోంది. షాహిద్ కపూర్ రెమ్యునరేషన్ పెంచాడనేది అఫీషియల్ కాకున్నా ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రం బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.