టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand ), రాశీఖన్నా (Raashi Khanna) కాంబినేషన్లో వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్ (Pakka commercial). మారుతి (maruthi) డైరెక్షన్లో కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 1న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చేసిన చిట్ చాట్లో సెంటిమెంట్ సీన్లు, డ్రామా సన్నివేశాలు. కామెడీ సన్నివేశాల్లో నటించేందుకు ఇష్టపడతానని చెప్పింది రాశీఖన్నా.
‘కామెడీ చేయడం చాలా కష్టమనేది నా అభిప్రాయం. మన కామెడీ టైమింగ్ ఫ్రేమ్లో ఉన్న ఇతర యాక్టర్పై ఆధారపడి ఉంటుంది. అయితే కామెడీతో పోలిస్తే రొమాన్స్ చాలా సులభం. కామెడీ చేయడం కంటే ఆన్ స్క్రీన్లో హీరోలతో రొమాన్స్ చేయడం సులభమైన విషయం. అయితే రొమాన్స్ తనకు చాలా బోరింగ్గా అనిపిస్తోందని..ప్రస్తుతానికి కామెడీని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానంది’ రాశీఖన్నా.
‘కామెడీ పాత్రలు నాకు కొత్త గుర్తింపును తెస్తున్నాయి. కానీ అవకాశమొస్తే యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్నా. మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ లైన్స్ లో యాక్షన్ సినిమాలు చేయడమంటే తనకిష్టమని’ చెప్పుకొచ్చింది. గోపీచంద్ 29వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి, అజయ్ ఘోష్, శియా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.