టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). మహాభారతంలోని ఆదిపర్వం స్పూర్తిగా..కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతుంది. మైథలాజికల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో సామ్ శకుంతలగా కనిపించనుండగా..మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత్ రాజుగా నటిస్తున్నాడు. కబీర్ సింగ్ దుహన్ కింగ్ అసుర పాత్ర పోషిస్తున్నాడు.
గుణశేఖర్ (Gunasekhar) డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా కోసం సమంత చాలా కష్టమే పడింది. తన పాత్ర కోసం సామ్ ప్రత్యేకించి బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకుంది. క్లాసికల్మోడ్లో ఉండే శకుంతల పాత్ర కోసం మూడు నెలలు శిక్షణ తీసుకున్నట్టు చెప్పింది సామ్. పురాణాలకాలం నాటి సాధారణ భంగిమలు, మనోహరమైన నడక , పౌరాణిక పాత్రలతో అనుసంధానంగా ఉండే సంజ్ఞలు, ఇతర అంశాలపై సామ్ శిక్షణ తీసుకుందట.
ఈ చిత్రాన్ని 2022 చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కూతురు అర్హ కనిపించనుంది. పాన్ ఇండియా కథాంశంతో పీరియాడికల్ ప్రాజెక్టుగా వస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తయింది. మరోవైపు సామ్ మల్టీలింగ్యువల్ ప్రాజెక్టు యశోదలో టైటిల్ రోల్ చేస్తోంది.