Samantha | నాగచైతన్యతో విడాకుల అనంతరం సినిమాల వేగాన్ని పెంచింది సమంత. ‘ఫ్యామిలీమెన్-2’ సిరీస్తో పాటు ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ..అంటావా…’ పాటతో దేశవ్యాప్తంగా యువతరం ఆరాధ్య నాయికగా మారింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సోషల్మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటున్నది సమంత. తన అంతరంగాన్ని ఆవిష్కరించే కొటేషన్స్, పోస్ట్లతో వార్తల్లో నిలుస్తున్నది. తాజాగా ఈ భామ హైదరాబాద్లో తాను నాగచైతన్యతో కలిసి నివసించిన ఫ్లాట్ను తిరిగి ఖరీదు చేసిందనే వార్త వైరల్గా మారింది.
ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ వెబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పెళ్లయిన తర్వాత నాగచైతన్య, సమంత మేము నివసించే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉండేవారు. కొత్త ఫ్లాట్ ఖరీదు చేసుకొని అందులోకి మారుదామనుకుంటున్న తరుణంలోనే వారు విడిపోయారు. ఆ తర్వాత వారి ఫ్లాట్ను మరొకరు కొనుగోలు చేశారు. సమంతకు ఆ ఫ్లాట్ బాగా నచ్చడంతో ఓనర్కు ఎక్కువ మొత్తం చెల్లించి తిరిగి సొంతం చేసుకుంది’ అని మురళీమోహన్ తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Vijay Devarakonda | విజయ్ దేవరకొండ యాక్షన్ ప్లాన్ రెడీ”