భీమ్గల్, ఏప్రిల్ 1: భీమ్గల్ మండలంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం బిజీబిజీగా గడిపారు. పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. మండలంలోని జాగిర్యాల్లో రూ.ఐదు లక్షలతో నిర్మించిన గ్రామాభివృద్ధి కమిటీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం భీమ్గల్లో మున్సిపల్కు చెందిన నూతన జేసీబీ వాహనాన్ని ప్రారంభించారు. రూ.2.60 కోట్లతో చేపట్టనున్న లింబాద్రి గుట్ట వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బాచన్పల్లిలో రూ. 5లక్షలతో నిర్మించిన గ్రామాభివృద్ధి కమిటీ భవననాన్ని ప్రారంభించారు. అనంతరం ముచ్కూర్ గ్రామంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.65లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులతోపాటు నూతన జీపీ భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమి క పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భీమ్గల్ మున్సిపల్కు మూడు ట్రాక్టర్లు, నాలుగు ఆటో ట్రాలీలు, ఒక జేసీబీని సమకూర్చినట్లు తెలిపారు. లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా గిరి ప్రదక్షిణ కోసం గుట్టచుట్టూ రోడ్డును ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. బడాభీమ్గల్లో రూ.20 లక్షలతో నిర్మించిన మున్నూరుకాపు కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. కౌన్సిలర్లు ప్రేమలత, గంగాధర్ సతీశ్, నర్సయ్య, లత, అనుపమ, ఖైరున్నీసాబేగం, కో-ఆప్షన్ సభ్యులు అజ్మత్, నవీన్, శోభ, మండల అధ్యక్షుడు నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, సర్పంచులు శంకర్, రాజేందర్, మానస, జ్యోతి, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన సర్పంచ్ నవీ న్, ఉపసర్పంచ్ తాహెర్, లిఫ్ట్ కమిటీ సభ్యులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి చెందిన లిఫ్ట్ సాప్ట్ ప్యానల్ ఇటీవల కాలిపోయింది. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సాఫ్ట్ ప్యానల్ ఏర్పాటు చేయించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో లిఫ్ట్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
ఊరేగింపును అడ్డుకున్నారని.. పోలీసులపై సిక్కుల వీరంగం
ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య