టాలీవుడ్ (Tollywood)లో లీడింగ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు పూజాహెగ్డే (Pooja Hegde). ఈ బ్యూటీ మరో రెండు రోజుల్లో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే పాన్ ఇండియా ప్రాజెక్టు రాధేశ్యామ్తో అందరినీ పలుకరించింది. ఇక ఎఫ్ 3లో ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. ఈ భామ చేతిలో ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమా ఒక్కటే మిగిలి ఉంది. ఈ సినిమా కూడా గతంలో కోవిడ్ ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
ఫర్హద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్న కభి ఈద్ కభి దివాళి (Kabhi Eid Kabhi Diwali) చిత్రాన్ని సాజిద్ నదియావాలా తెరకెక్కిస్తున్నారు. ఫైనల్గా సల్మాన్ ఖాన్ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. బీటౌన్ తాజా అప్డేట్ ప్రకారం వచ్చే నెలలో షూటింగ్ షురూ కానుంది. ముంబైకి సమీపంలోని కర్జాత్ లో మే నెలలో మారథాన్ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని 90 రోజుల షెడ్యూల్లో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట సల్లూభాయ్.
అంతేకాదు పూజాహెగ్డే కూడా డేట్స్ ఇచ్చేయగా..వచ్చే 2-3 నెలలు పూర్తిగా ఈ ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టబోతుందని సమాచారం. తెలుగు మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాలైన మహేశ్ బాబు-త్రివిక్రమ్ ప్రాజెక్టు, పవన్కల్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న భవదీయుడు భగత్ సింగ్లో పూజాహెగ్డేను ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ 2 సినిమాలు ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టకపోవడంతో పూజాహెగ్డేకు సరిపోయేంత సమయం దొరికినట్టైంది. ఇపుడిక ఎలాంటి చింతా లేకుండా సల్మాన్ సినిమాపైనే దృష్టిపెట్టాలని ఫిక్సయినట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Also : Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
Read Also : Kiara Advani post | బ్రేకప్ వార్తల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్గా కియారా తాజా పోస్ట్