టాలీవుడ్ (Tollywood) యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు విడిచిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. గూఢచారి సినిమా తర్వాత అడివి శేష్కు శోభితా ధూళిపాళ మరోసారి జోడీగా నటిస్తోంది.
కరోనా ఎఫెక్ట్తో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ను ఫైనల్ చేశారు మేకర్స్. తాజా అప్ డేట్ ప్రకారం 2022 జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయిన స్టార్ హీరో మహేశ్బాబు (Mahesh Babu) ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. తెలుగు, హిందీతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది.
In Cinemas June 3rd 2022! @AdiviSesh @saieemmanjrekar @SashiTikka @SonyPicsIndia @GMBents @AplusSMovies pic.twitter.com/1evh2fpmnm
— Mahesh Babu (@urstrulyMahesh) April 27, 2022
మేజర్ చిత్రంలో బాలీవుడ్ భామ, దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈచిత్రాన్ని విడుదల నిర్మిస్తున్నాయి.