సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ఇద్దరు తాజా వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారనేది హాట్ టాపిక్గా మారింది. హీరోయిన్లలో కొందరు షార్ట్ టర్మ్లో సక్సెస్ అందుకోవడమే కాదు..టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కూడా కొట్టేస్తుంటారు. కానీ ఇంకొందరు మాత్రం సరైన హీరోల కోసం వెతుకుతూ ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టింది షాలినీ పాండే. అయితే ఆ తర్వాత ఈ భామ టాలీవుడ్ (Tollywood)లో ఆశించినంతగా పాపులర్ కాలేకపోయింది. మరోవైపు ఛలో, గీత గోవిందం ఫేం రష్మిక మందన్నా మాత్రం ఇపుడు ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.
పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీతో కలిసి మెహబూబా సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది బెంగళూరు భామ నేహాశెట్టి (Neha Shetty). ఈ బ్యూటీ కూడా ఇపుడిదే దారి కోసం వెతుకులాటలో పడిందట. ఇటీవలే డీజే టిల్లు (DJ Tillu Heroine) లో రాధికా అక్క పాత్రతో చాలా పాపులర్ అయిపోయింది నేహాశెట్టి. అయితే మెహబూబా సినిమా తర్వాత అప్పట్లో చిన్న హీరోల సినిమాలను తిరస్కరిస్తూ వచ్చిన నేహా..అల్లు అర్జున్, మహేశ్ లాంటి హీరోలతో సినిమాల కోసం ఎదురుచూసింది.
కట్ చేస్తే లాంగ్ గ్యాప్ తర్వాత యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)తో సినిమా చేసి హిట్టు కొట్టింది. అయితే ఈ హిట్టుతో ఇక నేహాశెట్టి పెద్ద సినిమాల ఆఫర్ల కోసం ప్రయత్నస్తుందని అంతా అనుకున్నారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇప్పటికే టాప్ హీరోయిన్లను తమ సినిమాలకు ఫైనల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేహాశెట్టి తన దగ్గరకు ఎలాంటి సినిమాలు వచ్చినా సంతకం చేయాలని ఫిక్స్ పోయిందట.
అందుకే ఇటీవలే ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ(Karthikeya)తో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ లెక్కన హిట్ హీరోనా..? ఫ్లాప్ హీరోనా అని సంబంధం లేకుండా ప్రస్తుతానికి వచ్చిన సినిమా చేసుకుంటూ..రానున్న రోజుల్లో బిగ్ స్టార్లతో నటించాలని అనుకుంటుందని ఇపుడు ఇండస్ట్రీ అంతా టాక్ నడుస్తుంది.