బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు చిరంజీవి (Chiranjeevi). ఇప్పటికే మెగాస్టార్ నటించిన ఆచార్య (Acharya) ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ ప్రాజెక్టు విడుదల కాకముందే మరోవైపు మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ (Tollywood), మెహర్ రమేశ్ దర్శకత్వంలో నటిస్తోన్న భోళా శంకర్ (Bhola Shankar) సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇదిలా ఉంటే మరోవైపు యువ దర్శకుడు వెంకీ కుడుములతో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించి..అందరిలో జోష్ నింపాడు.
తాజాగా చిరు మీడియాతో ముఖాముఖి సందర్భంగా చేసిన కామెంట్స్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. చిరంజీవి పుష్ప సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్ను పర్ ఫెక్ట్గా ఫాలో అవుతున్నాడీ స్టార్ హీరో. ఇంతకీ విషయం ఏంటంటే ఇంకా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయని చెప్పడం. నేను నటించిన, షూటింగ్ లో పాల్గొంటున్న చిత్రాలతోపాటు చాలా ప్రాజెక్టులు లైన్ లో పెట్టాను. ఈ సినిమాను రానున్న రోజుల్లో ప్రకటిస్తా..అని స్టేట్ మెంట్ ఇచ్చాడు చిరు.
తాజా కామెంట్స్ తో చిరంజీవి యువ దర్శకుడు కుడుముల, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) ప్రాజెక్టులతో మరిన్ని చర్చల దశలో ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాడని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మొత్తానికి చిరు వెంట వెంటనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయి.. అభిమానులకు ఊపిరాడకుండా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్తలు ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.