Harish Rao | నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీజీపీతోపాటు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో వారి డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ తలొగ్గుతూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ మూడు డిమాండ్లు నెరవేరడంతో ఆందోళన విరమిస్తున్నట్టు సీజీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పందించారు.
తాజా సందర్భాన్ని దేశంలోని యువతకు ఇది ఒక గొప్ప విజయంగా హరీశ్ రావు అభివర్ణించారు.. సామాజిక దృక్పథంలో వస్తున్న మార్పు నిజంగానే కనిపిస్తోంది. విద్యార్థులందరికీ అభినందనలు.. అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు.
ఈ గొప్ప దేశంలోని విద్యార్థులు, యువత, ‘జెన్-జెడ్’ (Gen-Z) టీంకు అభినందనలు. ఈ విజయం మీదే. మీకు మా మద్దతును అందించినందుకు సంతోషంగా ఉంది.. అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.
Major victory for the country’s youth. The vibe shift is real.
Congratulations !!
— Harish Rao Thanneeru (@BRSHarish) July 25, 2026