పాన్ ఇండియా స్టార్ యశ్తో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులు తెరకెక్కించింది హోంబలే ఫిలిమ్స్. ఈ భారీ నిర్మాణ సంస్థ ప్రభాస్ (prabhas) తో సలార్ (Salaar) ప్రాజెక్టు చేస్తోంది. కేజీఎఫ్ కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్టర్ కావడంతో ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇపుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
ఇంతకీ ఆ విషయం ఏంటంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే మెయిన్ హైలెట్గా నిలిచేలా డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కేవలం ఈ సింగిల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చుపెడుతున్నారన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. లోయ ప్రాంతంలో ఈ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. లోయల్లో తీయబోయే భారీ ఛేజింగ్ అండ్ యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని టాక్ నడుస్తోంది.
ఇండియన్ సినిమాలోనే ది బెస్ట్ ఇంటర్వెల్ ఎపిసోడ్గా చూపించబోతున్నాడని తాజా అప్ డేట్ చెప్పేస్తుంది. 2023 వేసవిలో సలార్ విడుదల కానుంది. కోలీవుడ్ భామ శృతిహాసన్ (Shruti Haasan) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ (Vijay Kirgandur) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి మరోసారి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు.