ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది తమిళ భామ సాయిపల్లవి ( Sai Pallavi ). తన అందం, అభినయంతో ఆకట్టుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో మెరిసింది. అయితే సాయిపల్లవి రెండేళ్ల కిత్రం విడుదలైన ఎన్జీకే తర్వాత మరే తమిళ ( Tamil ) చిత్రంలో కనిపించలేదు. ఈ భామ మళ్లీ గ్రాండ్ కోలీవుడ్ కమ్ బ్యాక్ కు రెడీ అయినట్టు టాక్ చక్కర్లు కొడుతోంది.
ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో సాయిపల్లవి సినిమా చేస్తుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందని సమాచారం. సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో లవ్ స్టోరీ, విరాటపర్వం చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్ డౌన్ ప్రభావంతో నిలిచిపోయాయి. త్వరలో విడుదల తేదీలపై క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..