బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించింది హైదరాబాదీ భామ తేజస్వి మడివాడ. తరచూ హాట్ ఫొటోషూట్, బోల్డ్ లుక్స్ అండ్ క్యారెక్టర్లతో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ భామకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది. బిగ్ బాస్ కంటస్టెంట్గా, నటిగా ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన తేజస్వి కెరీర్ లో మరో ముందుడుగు వేసింది.
తేజస్వి అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జీ 5 సిరీస్ గాడ్స్ ఆఫ్ ధర్మపురితో విమర్శల ప్రశంసలు అందుకున్న యాక్టర్ కమ్ డైరెక్టర్ అనీష్ కురువిల్ల. ప్రస్తుతం ఈ దర్శకుడి టీంలో తేజస్వి మడివాడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. అనీష్ ప్రస్తుతం కొత్త సిరీస్ ను రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుతో తేజస్వి మడివాడ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్న కోరిక నెరవేర్చుకుంటుందట.
సినీ ఇండస్ట్రీలో డైరెక్షన్ ఫీల్డ్ లో అమ్మాయిలు తక్కువనే విషయం తెలిసిందే. మరి అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన తేజస్వి కొంత కాలం తర్వాత సినిమా కూడా తీసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
చిరు వ్యాపారులకు అండగా సోనూసూద్
ఎమోషనల్ అండ్ ఫన్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ట్రైలర్
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..