‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటి రాశీ ఖన్నా. స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. అన్ని భాషల్లో కలిపి ప్రస్తుతం రాశీఖన్నా చేతిలో ఎనిమిది సినిమాల దాకా ఉన్నాయి.
అయితే రాశీఖన్నాఇప్పుడు వెబ్ సిరీస్ ల్లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రెండు వెబ్ సిరిస్ లకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ‘ది ఫ్యామిల్ మ్యాన్’ వెబ్సిరీస్ తీసిన రాజ్&డీకే తాజాగా మరో వెబ్ సిరీస్ కు ప్లాన్ చేశారు. ఇందులో రాశీ ఖన్నా కీలక పాత్ర పోషించనుంది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మిస్తుంది.
ఇదే కాకుండా అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రుద్ర’ వెబ్ సిరీస్ లో సైకో కిల్లర్ పాత్రలో రాశీ కనిపించనుంది. రాజేశ్ ముపుస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను అప్లాజ్ ఎంటర్టైన్ మెంట్స్-బీబీసీ స్టూడియోస్ సంస్థలు కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిస్నీ హాట్ స్టార్ లో విడుదలయ్యే ఈ ప్రాజెక్టు లూథర్ అనే బ్రిటీష్ వెబ్ సిరీస్ ఆధారంగా రూపొందుతోంది.
రాశీఖన్నా ప్రస్తుతం తెలుగులో మారుతి-గోపిచంద్ ‘పక్కా కమర్షియల్’ లో, నాగ చైతన్య-విక్రమ్ కుమార్ ‘థాంక్యూ’ సినిమాల్లో నటిస్తోంది. ఇవే కాకుండా మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ భ్రమమ్ సినిమాలో నటిస్తుంది. తమిళంలో ఐదు సినిమాలకు సైన్ చేసింది. మొత్తంగా ఈ బబ్లీ బ్యూటి అన్ని భాషల్లోనూ ఫుల్ బిజీగా ఉంది.
ఇవి కూడా చదవండి..
చిరు వ్యాపారులకు అండగా సోనూసూద్
ఎమోషనల్ అండ్ ఫన్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ట్రైలర్
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..