కరోనా వలన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్స్కు వెళ్లాలంటే జనాలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో డిజిటల్ రంగంకు ఆదరణ బాగా లభిస్తుంది. కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీ స్థాపించగా, త్వరలో దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ వారు కూడా కొత్త ఓటీటీ సంస్థలను ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓటీటీ ప్రారంభించనున్నట్టు అఫీషియల్ గా పేర్కొన్నాడు.
ఇంతకుముందు సొంత ఏటీటీ అంటూ సందడి చేసిన ఆర్జీవీ ఇప్పుడు ప్రముఖ టీవీ హోస్ట్ స్వప్న.. వర్ధమాన వ్యాపారవేత్త సాగర్ మచనూరు సహకారంతో స్పార్క్ పేరుతో OTT ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు మరింత వినోదం పంచే ప్రయత్నం చేయబోతున్నాం అని అంటున్నారు వర్మ. అయితే వీరి ప్రయత్నానికి ప్రభాస్, అడివి శేష్ తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మే 15 నుంచి స్పార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.