శోభన్ బాబు, జయసుధ జంటగా తెరకెక్కిన సోగ్గాడి కాపురం.. సుమన్, సౌందర్య జంటగా రూపొందిన బాలరాజు బంగారు పెళ్లాం వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత సి. శ్రీధర్ తుదిశ్వాస విడిచారు. శ్రీధర్ స్వస్థలం నెల్లూరు కాగా, సినిమా ఇండస్ట్రీపై మక్కువతో చెన్నై వెళ్లారు. మంచి చిత్రాలను నిర్మించారు.
శ్రీధర్ గొప్ప సహృదయులు. ఆయన అనారోగ్యంతో మరణించారనే వార్త అందరిని ఆవేదనకు గురి చేసింది. శ్రీధర్ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబానికి తెలుగు చిత్రసీమ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. తెలుగు నిర్మాతల మండలి వారి కుటుంబీకులకు సానుభూతిని వ్యక్తం చేసింది.