టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan ) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 (RC 15) చేస్తున్నాడని తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా రాంచరణ్ తన సతీమణి ఉపాసన (Upasana Konidela) తో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్టు (Hyderabad airport)లో ప్రత్యక్షమైన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ ఇద్దరి వెంట పెట్ డాగ్ రైమ్ కూడా ఉంది.
ఇంతకీ చరణ్-ఉపాసన ఎక్కికెళ్లారనుకుంటున్నారా..? ఈ ఇద్దరూ వెకేషన్ కోసం ఊటీ వెళ్లారట. ఊటీ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్కు తిరిగొస్తుండగా..ఎయిర్పోర్టులో ఉన్న కెమెరాను క్లిక్ మనిపించాయి. ఇపుడీ ఫొటోలు, వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆర్సీ 15 షూటింగ్ కొత్త షెడ్యూల్లో త్వరలోనే జాయిన్ కానున్నాడని ఇన్ సైడ్ టాక్.
ఆర్సీ 15లో టాలీవుడ్ యాక్టర్లు శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, కన్నడ యాక్టర్ జయరామ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్జే సూర్య నెగెటివ్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
Mega Power Star @alwaysRamCharan and his wife @UpasanaKonidela were spotted at the airport along with their cute pet, #Rhyme while returning from their vacation. #RamCharan @onlynikil pic.twitter.com/TXur6Srh6b
— BA Raju's Team (@baraju_SuperHit) September 21, 2022