రాజమౌళి అంటే ఇప్పుడు కేవలం తెలుగు దర్శకుడు మాత్రమే కాదు.. ఇండియన్ దర్శకుడు. ఆయన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చూపిస్తున్నాయి. అందుకే రాజమౌళి ఏదైనా మాట మాట్లాడితే అది దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. తాజాగా ఈయన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఉన్న వసతులపై తనదైన శైలిలో విమర్శలు చేశాడు. సాధారణంగా ఎవరినీ పెద్దగా టార్గెట్ చేయని రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అక్కడ కనీస వసతులు కూడా లేకపోవడం చూసి అసహనం వ్యక్తం చేశాడు. ఈయన చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
జూలై 1 తెల్లవారుజామున తాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకోగానే అక్కడ కరోనా నిబంధనల ప్రకారం కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సి వచ్చిందని.. అయితే ఆ పత్రాలు నింపడానికి కనీస సౌకర్యాలు కూడా లేవని ట్విట్టర్లో తెలియజేశాడు జక్కన్న. రాజమౌళి చేసిన ట్వీట్పై ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వెంటనే స్పందించింది. డియర్ రాజమౌళి.. మీరు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ కు చాలా సంతోషం.. అక్కడ వసతులు పెంపొందించడానికి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి మీరు ఇచ్చిన సలహాలు చాలావరకు తోడ్పడతాయి. ఆర్టీపీసీఆర్ వివరాలు నింపడానికి అక్కడ డెస్కులు ఉన్నాయి. మీరు చెప్పినట్లు మరికొన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామంటూ ఢిల్లీ ఎయిర్ పోర్టు యాజమాన్యం రిప్లై ఇచ్చింది. ఇది రాజమౌళి స్థాయి అంటూ ఆయన అభిమానులు గర్వంగా చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆస్పత్రిలో కత్తి మహేశ్ .. చికిత్సకు ఏపీ సీఎం జగన్ భారీ ఆర్థికసాయం
సునీతపై అసభ్యకరమైన పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సింగర్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!
ఆఫర్ల కోసం చూస్తున్న మాధురీదీక్షిత్..!