Priyanka Chopra | గ్లోబల్ స్టార్ (Global Star), బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) భారత్ (India)లో అడుగుపెట్టారు. పెండ్లి తర్వాత లాస్ఏంజెల్స్ (Los Angeles)లో స్థిరపడిన ఆమె అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తుంటారు. ఇందులో భాగంగానే శుక్రవారం మధ్యాహ్యం భర్త నిక్ జొనాస్ (Nick Jonas ), కుమార్తె మల్తీ మేరీ చోప్రా జొనాస్ (Malti Marie Chopra Jonas)తో కలిసి ముంబై (Mumbai)కి చేరుకున్నారు. కాగా, ప్రియాంక కుమార్తెతో కలిసి భారత్కు రావడం ఇది మొదటిసారి. తల్లైన తర్వాత గతేడాది ప్రియాంక భారత్ వచ్చారు. అయితే అప్పుడు కుమార్తెను వెంట తీసుకురాలేదు. ఇప్పుడు కుమార్తెతో పాటు భారత్ వచ్చిన ప్రియాంక.. ముంబై ఎయిర్పోర్ట్లో దిగగానే మల్తీని మీడియాకు చూపిస్తూ సందడి చేశారు. భర్తతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించి పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్ (Hollywood)లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేండ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ (Pop Singer) నిక్ జొనాస్ (Nick Jonas)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. అనంతరం 2022 ఏడాదిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్తో కలిసి లాస్ఏంజెల్స్లోనే ఉంటోంది. పలుహాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది.
Also Read..
Dutch Tourist | గోవాలో విదేశీ పర్యాటకురాలిపై కత్తితో దాడి
VC Sajjanar | అలాంటి వాటికి సహకరించొద్దు.. బిగ్బీకి సజ్జనార్ విజ్ఞప్తి
Mosquito Coil | విషాదం.. మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ పీల్చి ఆరుగురు మృతి