‘వర్షం’ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ”పేపర్ బాయ్” సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సంతోష తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్గా ఏక్ మినీ కథ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ వలన ఈ సినిమా థియేటర్స్లో కాకుండా ఓటీటీలో విడుదలైంది. బోల్డ్ కథలో ఆత్మనూన్యతా భావం గల యువకుడిగా సంతోష్ శోభన్ నటన ప్రేక్షకులను మెప్పించింది.
తాజాగా తన నూతన చిత్రం ప్రేమ్ కుమార్ అనే టైటిల్తో తెరకెక్కనుందని తెలియజేశాడు సంతోష్ శోభన్. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సారంగ ఎంటర్టైన్మెంట్స్ పై.లి. పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇందులో సంతోష్ ..పెళ్లి కొడుకు గెటప్ లో చేతిలో తాళి పట్టుకొని భూతద్దంలో చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ కార్టూన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. చిత్రంలో పెళ్లి సమస్యతో సతమతమయ్యే అబ్బాయిగా.. అందర్నీ నవ్వించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. లాక్ డౌన్ తర్వాత మిగతా భాగం షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చగా.. కిట్టు విస్సాప్రగడ పాటలు రాస్తున్నారు.