న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో కొనసాగుతున్నది. సెకండ్ వేవ్ అత్యంత వేగంగా సోకడంతో పాటు పెద్ద ఎత్తున ప్రాణాల్ని బలి తీసుకుంటున్నది. సాధారణ రోగులతో పాటు వైద్యులు సైతం మహమ్మారికి బలవుతున్నారు. దేశంలో రెండో దశ వైరస్ వ్యాప్తిలో జూన్ 2వ తేదీ వరకు 624 మంది వైద్యులు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో 109 మంది మరణించగా, బీహార్లో 96 మంది, ఉత్తర ప్రదేశ్లో 79 మంది, రాజస్థాన్లో 43 మంది, ఉత్తరాఖండ్లో 39మంది, ఆంధ్రప్రదేశ్ 34 మంది, తెలంగాణ 32 మంది, గుజరాత్ 31 మంది, పశ్చిమ బెంగాల్ 30 మంది ప్రాణాలు వదిలారు. గతేడాది కరోనా మొదటి వేవ్లో 748 మంది వైద్యులు ప్రాణాలు కరోనాకు బలయ్యారని పేర్కొంది.