హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కరోనా కేంద్రంగా దుష్ప్రచారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు కొత్త పథకాలు ప్రకటించాయంటూ సోషల్మీడియాలో అవాస్తవాలను గుర్తిస్తే 8799711259కు వాట్సాప్ చేయాలని లేదా @PIB Fact checkకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదుచేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇటీవల కొవిడ్ వ్యాక్సినేషన్, ఔషధాలు, కరోనా మరణాలు, వైరస్ వ్యాప్తి ఇలా అనేకాంశాలపై సోషల్మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారంలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయని.. కొత్త పేర్లతో పథకాలు ప్రవేశపెట్టారంటూ వైరలవుతున్నాయి. ఇలాంటి ఫేక్న్యూస్ను గుర్తిస్తే ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా సైబర్క్రైం పోర్టల్కు ఫిర్యాదుచేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది.