టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga chaitanya) ప్రస్తుతం విక్రమ్ కుమార్ (Vikram Kumar) దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా చైతూ మరోవైపు విక్రమ్ కుమార్తో ధూత (Dhoota) అనే ఓటీటీ ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ (Prachi Desai) ఈ సిరీస్లో కీ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. ప్రాచీ దేశాయ్ అండ్ టీం షూటింగ్లో పాల్గొంటుంది.
ఈ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ రావడం మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్ అని అంటోంది ప్రాచీ దేశాయ్. తాజాగా ఇదే విషయాన్ని షేర్ చేసుకుంటూ..చైతన్య, విక్రమ్ కుమార్తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మంచి ఆహారం, మధురమైన క్షణాలతో హైదరాబాద్లో ఉండేలా చేసిన విక్రమ్, చైకు ధన్యవాదాలు తెలియజేసింది ప్రాచీ దేశాయ్. ఇపుడీ ఫొటో నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది.
Read Also : Kamal Haasan | లాభాలతో కమల్ హాసన్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?
Read Also : Brahmastra | షారుక్, నాగార్జున కనిపించేది ఈ పాత్రల్లోనేనట..!
Read Also : Vijay Sam | లిటిల్ ఖుషీతో విజయ్-సమంత..ట్రెండింగ్లో స్టిల్