టాలీవుడ్లో కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్ మారుతి (Maruthi)-ప్రభాస్ (Prabhas). ఈ ఇద్దరూ త్వరలోనే ఓ సినిమాతో ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నారని ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా ఇపుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మారుతి, ప్రభాస్ సినిమాను రేపు (గురువారం) లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
చాలా ఎక్జయిటింగ్గా ఉన్న ఈ వార్త నిజమా..? కాదా..? అనే దానిపై మేకర్స్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాపులర్ ప్రొడక్షన్ హౌస్తో కలిసి భారీ స్థాయిలో నిర్మించనున్నట్టు ఇప్పటివరకున్న టాక్. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో కోలీవుడ్ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపించనుందని ఇప్పటికే వార్తలు రాగా..దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కామెడీ బ్యాక్ డ్రాప్లో ఉండనుందని ఓ టాక్ నడుస్తుండగా..లేదు యాక్షన్ నేపథ్యంలో సాగనుందంటూ మరో టాక్ కూడా జోరుగా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరూ ఎలాంటి సినిమాతో రాబోతున్నారనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Read Also : Hari Hara Veera Mallu | నిర్మాత యాక్టివ్..పవన్ సైలెన్స్..సినిమా పూర్తయ్యేనా..?
Read Also : Odela Railway Station Trailer | హత్యాచారం స్టోరీతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ ట్రైలర్
Read Also : Crazy News | క్రేజీ టాక్..ప్రభాస్-మారుతి సినిమా లాంఛ్ రేపే..?