కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ (Hebah Patel) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station ). ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ, వశిష్ణ ఎస్ సింహా, సాయి రోనక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా(Odela Railway Station Trailer) ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
ఓదెల గ్రామంలో కొత్తగా పెళ్లైన ఓ మహిళపై జరిగిన హత్యాచార ఘటన చుట్టూ తిరిగే కథాంశంతో సస్పెన్స్ ఎలిమెంట్స్ సాగుతుంది ట్రైలర్. అసలు హత్యాచారానికి గురైన ఆ మహిళ ఎవరు..ఇంతకీ ఆమెను బలితీసుకుంది ఎవరు..? అనే అంశాలపై ట్రైలర్లో సస్పెన్స్ లో పెడుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు డైరెక్టర్.
అశోక్ తేజ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది కథనందించగా..అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఆహాలో ఆగస్టు 26న ప్రీమియర్ కానుంది.
HERE IT IS.. #OdelaRailwayStationTrailer
RAW, RUSTIC emotions straight out of their POWERCENTRE!#OdelaRailwayStationOnAHA
▶️ https://t.co/vZbmpfAOxxFrm Aug 26🍿@SriSathyaSaiArt @ashokalle2020 @ihebahp @ImSimhaa @soundar16 @saironak3 @anuprubens @KKRadhamohan @ahavideoIN
— Sampath Nandi (@IamSampathNandi) August 24, 2022