కోలీవుడ్ (kollywood) స్టార్ యాక్టర్ విజయ్ (Vijay) నేషనల్ అవార్డు విన్నింగ్ తెలుగు డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally)తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ (Vijay66th)వ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ..ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఫైనల్ అయినట్టు గాసిప్స్ ఇప్పటికే రౌండప్ చేశాయి.
తాజాగా మరో భామ లైన్లోకి వచ్చింది. మహేశ్బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో నటించిన కృతిసనన్ను విజయ్కు జోడీగా ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఒకవేళ కృతిసనన్ ఈ చిత్రానికి సైన్ చేస్తే..సౌతిండియా సినిమాకు ఇది కమ్ బ్యాక్ మూవీ కానుంది. అన్నీ కుదిరితే కృతిసనన్, విజయ్ క్రేజీ కాంబినేషన్ను సిల్వర్ స్క్రీన్పై చూసే టైం అతి దగ్గరలో ఉన్నట్టేననుకుంటున్నారు సినీ జనాలు. టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations)లో ఈ సినిమా చేస్తున్నారు.
వంశీపైడిపల్లి-విజయ్ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనున్నట్టు టాక్. విజయ్, వంశీ పైడిపల్లి తెరపై ఎలాంటి స్టోరీతో సందడి చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.