టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)తో లైగర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే ఈ క్రేజీ కాంబోలో రెండో ప్రాజెక్టు జీజేఎం (Jana Gana Mana) (జనగణమన) కూడా లాంఛ్ అయింది. ఛార్మీ, వంశీపైడిపల్లి, పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
జులై నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ చిత్రంలో పూజాహెగ్డే (Pooja Hegde)-విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయబోతుందట. ఫీ మేల్ లీడ్ రోల్లో నటించేందుకు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్పై పూజా-విజయ్ జోడీ ఎంటర్టైన్ చేయడం పక్కా అయిపోయినట్టే. మేకర్స్ ముందుగా జాన్వీకపూర్ను తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినా..వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆర్మీ, వార్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం 2023 ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది.