బాలీవుడ్ (Bollywood) హీరోయిన్ సోనమ్ కపూర్ (Sonam Kapoor)నివాసంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని అమృతా షేర్గిల్ మార్గ్ (Amrita Shergill Marg)లో ఉన్న సోనమ్-ఆనంద్ ఆహూజా (Anand Ahuja house) నివాసంలో రూ.2.4 కోట్ల విలువైన నగదుతోపాటు బంగారం చోరీకి గురైనట్టు కపూర్ హౌజ్ మేనేజర్ తుగ్లక్ రోడ్ (Bollywood)పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసులో నిందితురాలు, నర్సు అపర్ణ రుతు విల్సన్ తోపాటు ఆమె భర్త నరేశ్ కుమార్ను అరెస్ట్ చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
నరేశ్ కుమార్ సాగర్ శకార్పూర్లోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడని తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 11న దొంగతనం జరిగింది. ఫిబ్రవరి 23న తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో పోలీస్ రిపోర్టు ఫైల్ చేశారు. ఆనంద్ ఆహూజా నివాసంలో 20మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు, న్యూ ఢిల్లీ జిల్లా స్పెషల్ స్టాఫ్ బ్రాంచ్ టీంతో కలిసి మంగళవారం రాత్రి సరితా విహార్ (Bollywood)లో దాడులు చేపట్టారు.
ఈ దాడుల్లో విల్సన్-నరేశ్ కుమార్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ కేసులో పోలీసులు అదనపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అమృతా షేర్గిల్ మార్గ్ హౌజ్లో పని చేసే సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ స్టాఫ్ బ్రాంచ్, క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.