‘తెలంగాణ ప్రాంత కళాకారులు, యాస, భాషలతో రూపొందుతున్న చిత్రమిది. సిద్దిపేటలోనే షూటింగ్ మొత్తం జరపాలని చిత్రబృందం నిర్ణయించడం అభినందనీయం’ అని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు. ‘వెంకీ పింకీ జంప్’ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విక్రమ్, దేవకి రమ్య, హర్షిత నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ నాతరి దర్శకుడు. ఆర్. వెంకట్ నిర్మాత. ఇటీవల ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంత్రి హరీష్రావు క్లాప్నిచ్చారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. సిద్దిపేట్లో రెండు నెలల పాటు జరిపే సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తిచేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్రాజా.
ఇవి కూడా చదవండి:
సినిమాలకు సెన్సార్ అవసరం లేదు!
రాజకీయ ప్రచారానికి వెళ్లినట్లనిపించింది!