టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 154వ (#Mega154). బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలోమాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కీ రోల్ చేస్తున్నాడు. అయితే రవితేజ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో కొనసాగుతుంది.
ఇప్పటికే షూట్లో జాయిన్ అవుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు రెమ్యునరేషన్ల (Remunerations ) విషయం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రం కోసం కేవలం రెమ్యునరేషన్లకే రూ.75 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్టు ఓ న్యూస్ హాట్ టాపిక్గా మారింది.
లేటెస్ట్ టాక్ ప్రకారం చిరంజీవికి రూ.40 కోట్లు, రవితేజకు రూ.18 కోట్లు పారితోషికం ఇస్తుండగా..డైరెక్టర్ బాబీ రూ.5 నుంచి 6 కోట్ల వరకు ఇతర మొత్తాన్ని మిగిలిన నటీనటులు, హీరోయిన్లు, టెక్నీషియన్లకు ఇస్తున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. సినిమాకు తక్కువలో తక్కువ 100 పనిదినాలు కేటాయించినట్టు టాక్. ఈ లెక్కన బడ్జెట్ కూడా పెరిగిపోవడం సహజమే. ఇప్పటివరకు ట్రేడ్ సర్కిల్లో రౌండప్ చేస్తున్న వార్తల ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ చిరుతో తెరకెక్కించిన ఆచార్య రూ.40 కోట్లు నష్టం తెచ్చిందట.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా కేవలం రెమ్యునరేషన్ల మీదే భారీ మొత్తంలో ఖర్చు పెడుతుండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుందంటున్నారు సినీ పండితులు. చిరంజీవి ఫిషర్మెన్గా (మత్స్యకారుడు) కనిపించనున్న ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Read Also : Laya Hook Step | యూఎస్ వీధుల్లో లయ కొత్త హుక్ స్టెప్..వీడియో హల్చల్
Agent Teaser | Kesariya Song | బ్యూటిఫుల్ ‘కేసరియా’ మెలోడీ లవ్ ట్రాక్ వచ్చేసింది..