టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం మట్టి కుస్తీ (Matti Kusthi). కోలీవుడ్ యాక్టర్ విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. హోం బ్యానర్ ఆర్టీ టీమ్ వర్స్ (RT Teamworks)పై రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెల్లా అయ్యవు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలో గట్ట కుస్తీ టైటిల్తో తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ను మేకర్స్ షేర్ చేసుకున్నారు.
మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఈ ప్రాజెక్టులో హీరోయిన్గా నటిస్తోంది. డైరెక్టర్ అండ్ టీం ఐశ్వర్య లక్ష్మిని తమ టీంలోకి స్వాగతం పలికారు. కాగా ఇవాళ మట్టి కుస్తీ షూటింగ్ తమిళనాడులోని టెన్సాకీ టౌన్లో మొదలైంది. షూటింగ్ లొకేషన్లో యాక్షన్ చెప్పిన తర్వాత మానిటర్ చెక్ చేసుకుంటున్న స్టిల్ ఒకటి మేకర్స్ విడుదల చేశారు. హీరోహీరోయిన్లు, డైరెక్టర్ ఈ స్టిల్లో చూడొచ్చు. ఈ చిత్రాన్ని విష్ణువిశాల్ కూడా తన హోంబ్యానర్లో నిర్మిస్తూ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు.
మట్టి కుస్తీ చిత్రానికి రాధేశ్యామ్ ఫేం జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ డైరెక్టర్. సత్యదేవ్ హీరోగా గోపీగణేశ్ డైరెక్ట్ చేస్తున్న గాడ్సేతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.