తాను తెలుగు, తమిళ సినిమాలపై చౌకబారు కామెంట్స్ చేసినట్టు సోషల్మీడియాలో రౌండప్ చేస్తున్న వార్తలపై ఢిల్లీ సుందరి రాశీఖన్నా (Raashi Khanna) స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్పెషల్ నోట్ పోస్ట్ చేసింది. తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని పేర్కొంది. అన్ని భాషలు, అన్ని సినీ పరిశ్రమలంటే తనకు చాలా గౌరవం ఉందంది రాశీఖన్నా.
దక్షిణాది సినిమాల (south films)పై నేను తప్పుగా మాట్లాడినట్టు కొన్ని కల్పిత, తప్పుడు కంటెంట్ సృష్టించారు. ఈ పని ఎవరు చేస్తున్నారో దయచేసి ఆపేయాలని కోరుతున్నా. నాకు ప్రతీ భాషతోపాటు అన్ని భాషల సినీ పరిశ్రమలంటే చాలా చాలా గౌరవం ఉంది. కొంచెం దయతో ఉందాం..అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది రాశీఖన్నా. 2013లో మద్రాస్ కేఫ్ (Madras Cafe) అనే బాలీవుడ్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చింది.
ఈ బ్యూటీ మళ్లీ చాలా కాలానికి ఇటీవలే రుద్ర హిందీ (Rudra) వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఊహలు గుసగుసలాగే సినిమాతో హీరోయిన్గా తొలి ప్రయత్నంతోనే మంచి బ్రేక్ అందుకుంది రాశీఖన్నా. ఆ తర్వాత ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, గోపీచంద్, నాగచైతన్య లాంటి హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ (Pakka Commercial ) లో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.
అదేవిధంగా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ చేస్తున్న థ్యాంక్యూలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. హిందీలో యోధ సినిమాలో నటిస్తోంది. తమిళంలో నాలుగు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..వీటిలో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. తెలుగు సినిమాలతో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రాశీఖన్నా.
🙏🏻😊 pic.twitter.com/yQa1nOacEY
— Raashii Khanna (@RaashiiKhanna_) April 6, 2022