అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha), అఖిల్..ఒకపుడు ఈ ముగ్గురు చాలా అన్యోన్యంగా కలిసి మెలిసి తిరిగేవారు. కానీ చైతూ, సామ్ గతేడాది అక్టోబర్లో విడాకులు తీసుకున్న తర్వాత అంతా దూరమైపోయారు. మళ్లీ ఎలాంటి పుకార్లకు ఛాన్స్ ఇవ్వకుండా ఈ మాజీ కపుల్ వ్యక్తిగత, వృతిపరమైన పనులతో బిజీ అయ్యారు. ఇపుడు ఎవరూ ఊహించని ఇంట్రెస్టింగ్ డెవలప్ మెంట్ ఒకటి లైమ్ లైట్లోకి వచ్చింది. చైతూ, సామ్ తొలిసారి నువ్వా నేనా..అన్నట్టుగా బాక్సాపీస్ వద్ద పోటీ పడబోతున్నారు.
నాగచైతన్య ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న తొలి హిందీ చిత్రం లాల్ సింగ్ చద్దా (Laal Singh Chadhha). అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో చైతూ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతుంది. మరోవైపు సమంత పాన్ ఇండియా ఫీ మేల్ సెంట్రిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా యశోద (Yashoda)లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టు ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే అఖిల్ (Akhil)నటిస్తోన్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ (Agent) కూడా ఆగస్టు 12న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించేశారు.
బాక్సాపీస్ వద్ద చైతూ వర్సెస్ సమంత వర్సెస్ అఖిల్ ఫైట్ ఉండటం ఖాయమైనట్టే. మరి ట్రయాంగిల్ పోటీ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సారి తమ ఫేవరేట్ కపుల్ ఇలా బాక్సాపీస్ వద్ద పోటీ పడుతుండటం కొంత కష్టంగా ఫీలవుతున్నారట ఇద్దరి అభిమానులు.