మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక లూసిఫర్ రీమేక్ (Lucifer Remake) పై తన ఫోకస్ పెట్టాడు చిరు. ఈ ప్రాజెక్టు షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో షురూ అయింది. క్రేజీ అప్ డేట్ ఏంటంటే చిరంజీవి యాక్షన్ సన్నివేశాలతో లూసిఫర్ రీమేక్ చిత్రీకరణ మొదలైందట. పాపులర్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
చిత్రయూనిట్ మెంబర్స్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా, స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. చిరంజీవి 153వ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో ఓ పాటను పూర్తి చేసినట్టు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. రాంచరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
దీని తర్వాత బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్షన్ లో ఓ సినిమాతోపాటు, మెహర్ రమేశ్ డైరెక్షన్ లో మరో సినిమాతో బిజీ కానున్నాడు చిరంజీవి. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.