ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం
ఖమ్మం-సూర్యాపేట రహదారిపై విరిగిపడిన చెట్లు
చెట్టు మీద పడి వ్యక్తి మృతి
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం .. పలుచోట్ల గాలి ధుమారం
కొత్తగూడెం/ఖమ్మం అగ్రికల్చర్/ కొత్తగూడెం కల్చరల్/రఘునాథపాలెం/పెనుబల్లి/కూసుమంచి/కూసుమంచి రూరల్, ఏప్రిల్ 5: అప్పటివరకు ఎండలు కాసి సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో వాతావరణం చలబడింది. అక్కడక్కడా చెదురుమదురు వర్షం కురిసింది. కొన్నిచోట్ల గాలిధుమారంతో కూడిన చినుకులు కురిశాయి. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. దీంతో మండె ఎండలకు ఇబ్బంది పడిన ప్రజలు ఉపశమనం పొందారు. ఉక్కపోతలు, వేడిమి నుంచి తప్పించుకున్నారు. సింగరేణి ప్రాంతాలైన కొత్తగూడెంలో వాతావరణం మామూలుగా మారింది.నష్టం వాటిల్లుతుందని భయాందోళనకు గురయ్యారు.కూసుమంచి మండలంలోని సూర్యాపేట రోడ్డులో కొన్నిచోట్లు రహదారిపై నేలవాలాయి. ఇదే మండలంలో పలువురి ఇళ్లపై పైకప్పులు లేచి కిందపడ్డాయి. గాలిధుమారానికి సత్తుపల్లి, కూసుమంచి మండలంలో చెట్లు కిందపడ్డాయి. మరోవైపు అకాల వర్షానికి మిర్చి, వరి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందారు. పంటను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
చెట్టు మీద పడి వ్యక్తి మృతి..
గాలిధుమారానికి రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిపై చెట్టు పడి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సోమవారం మండలంలోని చెరుకుపల్లిలో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురానికి చెందిన బొమ్మకంటి వీరభద్రం(45) సత్తుపల్లి నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ గాలిధుమారంలో చెరుకుపల్లికి చేరుకోగానే ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న చెట్టు మీద పడింది. ఘటనలో వీరభద్రం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఓటర్లు 90 మంది, పోలైన ఓట్లు 181.. అస్సాంలో భారీగా రిగ్గింగ్
అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ అభివృద్ధి పరిచిన డీఆర్డీవో
కరోనా రెండో వేవ్ ఎఫెక్ట్: షిర్డీ సాయిబాబా ఆలయం మూత!
విజయ్ దేవరకొండ కోసం పద్ధతులు మార్చుకున్న పూరీ జగన్నాథ్..