కరోనా మహమ్మారి కోలీవుడ్పై పగబట్టింది. నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్, కమెడీయన్స్ ఇలా చాలా మంది ఇటీవలి కాలంలో కన్నుమూసారు. వారి మరణంతో కోలీవుడ్ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. అయితే వీరి మరణాన్ని మరచిపోక ముందే మరో ప్రముఖ టీవీ నటుడు కుట్టి రమేష్ అనారోగ్యంతో కన్నుమూసారు. తమిళ విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న ‘తేన్మోవి’, ‘బీఏ’ వంటి మెగా సీరియల్స్తో ప్రేక్షకులకు దగ్గైన రమేష్ గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన మృతి తీరని లోటని విజయ్ టీవీ బృందం సంతాపం ప్రకటించింది. రమేష్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.