షాబాద్, ఏప్రిల్ 19 : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కచ్చితంగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవో అధికారులు, డీపీవోలు, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. పంచాయతీ సెక్రటరీ, డీఆర్డీవో అధికారులు ఆశవర్కర్లు, వైద్యసిబ్బందితో సమన్వయంతో పని చేయించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐకేపీ సంఘాల ద్వారా మాస్కులను తయారు చేయించి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కరోనా నిబంధనలను పాటించేలా ఉపాధిహామీ కార్మికులకు మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రికి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డీఆర్డీవో పీడీ ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్రెడ్డి, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.