యంగ్ బాలీవుడ్ (Bollywood) బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) తాజా చిత్రం షేర్షా (Shershaah). అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రంలో కియారా బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) కూడా నటించాడు. ప్రతీ ఒక్క యాక్టర్ కు ఎవరో ఒక ఇష్టమైన నటీనటులతో యాక్టింగ్ చేయాలని ఉండటం సహజమే. మరి కియారాకు ఓ హీరోతో కలిసి పనిచేయాలని ఉందట. షేర్షా ప్రమోషన్స్ లో ఆ హీరో ఎవరో చెప్పింది కియారా. నేను రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) కు పెద్ద అభిమానిని. రణ్ బీర్ కపూర్ తో నటించే అవకాశం ఎప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్నానని చెప్పింది.
ఇక సిద్దార్థ్ మల్హోత్రాతో ఉన్న రిలేషన్ షిప్ పై కియారా స్పందిస్తూ…బాలీవుడ్ ఇండస్ట్రీ బెస్ట్ ఫ్రెండ్స్ లో సిద్దార్థ్ ఒకడంటూ చెప్పుకొచ్చింది. కోస్టార్ గా చాలా యాక్టివ్ గా, ఫోకస్ గా ఉంటాడు. తనను తాను ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. చాలా పుస్తకాలు చదువుతాడు. నేను సినిమాల్లో పనిచేసేందుకు ఇష్టమైన విషయాల్లో సిద్దార్థ్ లోని ఈ క్వాలిటీ చాలా దగ్గరగా పోలి ఉంటుంది. దీంతో మేమిద్దరం చాలా బాగా కలిసిసోయాం. సినీ పరిశ్రమలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో సిద్దార్థ్ ఒకరని చెప్తాను. ఓ స్నేహితుడిగా నా లైఫ్ లో ఎప్పుడూ ఉంటాడు. అంతేకాదు ఎప్పడూ నాతో సరదాగా ఉంటాడు.. అని సిద్దార్థ్ గురించి చెప్పుకొచ్చింది.
కియారా అద్వానీ ప్రస్తుతం హిందీలో భూల్ భూలయ్యా 2, జుగ్ జుగ్ జీయో, మిస్టర్ లేలే చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ లో దశలో ఉన్నాయి. మరోవైపు శంకర్-రాంచరణ్ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్ రోల్ కు కియారా దాదాపు ఫైనల్ అయినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!