బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కొద్ది రోజుల తన సతీమణి ఆరోగ్యంపై కలవరానికి గురైన సంగతి తెలిసిందే. కౌశల్ పోస్ట్ తర్వాత కొద్ది రోజులకు ఆయన భార్య నీలిమ యూకేలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో తాను కరోనా బారిన పడినట్టు పేర్కొంది. అయితే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి సిబ్బంది వైద్యానికి పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని చెప్పిన నీలిమ , మనదేశంలోనే మంచి వైద్యం అందిస్తున్నారని పేర్కొంది.
త్వరలోనే ఇండియాకు వస్తానని చెప్పిన నీలిమ తాజాగా తన భర్త, పిల్లలని కలుసుకుంది. కోవిడ్ వచ్చిన 8వ రోజే తనకు నెగిటివ్ రావడంతో ఆమె వెంటనే ఇండియాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని కౌశల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్( NHS )నుంచి తనకు సర్టిఫికెట్ రావడంతో నీలిమ భారత్ కు వచ్చేసింది. ఆమె ఆరోగ్యం గురించి ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…జై పారాసిటమాల్ అంటూ ఇన్స్టాలో కామెంట్ పోస్ట్ చేశారు కౌశల్.