ఇటీవల కాలంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చారిత్రాత్మక, మైథలాజికల్ డ్రామాలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కి రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇదే జోనర్ లో రానున్న మరో పెద్ ప్రాజెక్టు సీత. రామాయణంలో సీత వెర్షన్ లో సినిమా సాగనుంది. స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ సీత పాత్రలో నటించబోతున్నట్టు బీటౌన్ వర్గాల టాక్.
పాపులర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం చేయాలంటే విజయేంద్ర ప్రసాద్ కు రెండు షరతులు పెట్టిందట కరీనాకపూర్. వీటిలో మొదటిది సీత చేసే కంటే ముందే తాను చేస్తున్న సినిమాలు పూర్తి చేయడం. రెండోది తనకు రెమ్యునరేషన్ రూ. 12 కోట్లు ఇవ్వడం.
ఈ రెండు షరతులకు రైటర్ కమ్ టీం ఒప్పుకుందట. సాధారణంగా కరీనా 6-8 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అయితే సీత ప్రాజెక్టులో లీడ్ రోల్ కావడంతో ఎక్కువ రోజులు కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగిందట.అలౌకిక్ దేశాయ్ డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఇవి కూడా చదవండి..
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!