కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), స్టార్ డైరెక్టర్ జ్ఞానవేల్ (T. J. Gnanavel) కాంబినేషన్లో వచ్చిన చిత్రం
జైభీమ్ (Jai Bhim). ఓ చోరీ కేసులో అక్రమంగా ఇరికించబడ్డ అమాయక వ్యక్తి లాకప్ డెత్ కేసును చేధించిన లాయర్ రోల్లో నటించాడు సూర్య. డిజిటల్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జై భీమ్ అరుదైన గౌరవం అందుకుంది.
ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్-2022లో రెండు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన జైభీమ్..ఉత్తమ చిత్రం, ఉత్త సహాయ నటుడు అవార్డులు దక్కాయి. బాధితుడి పాత్రలో జీవించిన మణికందన్కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. ఈ చిత్రంలో రావు రమేశ్, రజిషా విజయన్, ప్రకాశ్ రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
కే మణికందన్, లిజొమోల్ జోస్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని హోం ప్రొడక్షన్స్ 2డీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై సూర్య-జ్యోతిక స్వయంగా నిర్మించారు.
నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో 3 అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఆస్కార్స్ అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో కూడా నామినేట్ అయింది. అవార్డులు రావడంతో సూర్య అండ్ టీం సెలబ్రేషన్స్ మూడ్లోకి వెళ్లిపోయింది.