Jahnvi Kapoor | దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) కూతురుగా డెబ్యూ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ధడక్ (Dhadak) సినిమాతో సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. కెరీర్ తొలినాళ్లలోనే ఓ వైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. రొమాంటిక్, కామిక్, హార్రర్, థ్రిల్లర్.. ఇలా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ వెళ్తూ తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది.
ప్రస్తుతం జాన్వీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ (Mr And Mrs Mahi Movie) ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జాన్వీ చెన్నైలోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించింది. ముఖ్యమైన పనులు మొదలు పెట్టే ముందు జాన్వీ కపూర్ తన తల్లిని తల్చుకుంటూ శ్రీదేవికి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తుంటుందన్న విషయం తెలిసిందే. ఎక్కువగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంటుంది.
అయితే, ఈ సారి చెన్నైలోని శ్రీదేవికి ఇష్టమైన ఆలయాన్ని సందర్శించింది. తన పిన్ని మహేశ్వరితో కలిసి జాన్వీ ముప్పాత్తనం ఆలయానికి (Muppathanam Temple) వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ‘మొదటిసారి ముప్పాత్తనం ఆలయాన్ని సందర్శించాను. చెన్నైలో అమ్మకు ఎంతో ఇష్టమైన ప్రదేశం’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ జోడించింది. ఆలయ సందర్శన సందర్భంగా జాన్వీ సంప్రదాయ లంగాఓనీలో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి.
ఇక జాన్వీ కపూర్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. క్రీడా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హౌస్వైఫ్గా నటిస్తుంటే, భర్తగా విభిన్నమైన పాత్రలో రాజ్కుమార్రావు కనిపించనున్నారు. అపూర్వ మోహతా, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మరోవైపు జాన్వీ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ నటుడు ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దేవర’ (Devara)లో నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్గా) నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Also Read..
Kavya Maran | ఫైనల్లో హైదరాబాద్ ఓటమి.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్
KKR Celebrations | డ్రెస్సింగ్ రూమ్లో అంబరాన్నంటిన కోల్కతా నైట్రైడర్స్ సెలబ్రేషన్స్.. VIDEO
Viral Video | రోడ్డు మధ్యలో డివైడర్పై బైక్ నడిపిన యువకుడు.. వీడియో వైరల్