అహ్మదాబాద్: కరోనా కేసులు మరింత పెరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో నాలుగు ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగించింది. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్ నగరాల్లో ఇప్పటికే అమలవుతున్న నైట్ కర్ఫ్యూ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయి.
గతంలో విధించిన నైట్ కర్ఫ్యూ గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో దాన్ని మరో 15 రోజులు పొడిగిస్తూ గుజరాత్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. గుజరాత్లో మంగళవారం కొత్తగా 2,200 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,338కి చేరింది. మంగళవారం మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 4,510కి చేరింది.
మొత్తం పాజిటివ్ కేసులలో ఇప్పటివరకు 2,88,565 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మరో 12,263 యాక్టివ్ కేసులున్నాయి. అదేవిధంగా గుజరాత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 53,89,349 మందికి టీకాలు ఇచ్చారు. వారిలో 6,43,855 మంది రెండో డోసు కూడా తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు