టాలీవుడ్ (tollywood)లో కథాబలమున్న ప్రయోగాత్మక చిత్రాలు చేసే హీరోల లిస్టులో టాప్ ప్లేస్లో ఉంటాడు యువ హీరో శర్వానంద్ శర్వానంద్ (Sharwanand). ఇటీవలే మహాసముద్రం (Mahasamudram) శర్వానంద్ సినిమాతో మూవీ లవర్స్ ను పలుకరించాడు శర్వానంద్. అజయ్ భూపతి (ajay bhupathi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద చాలా నిరాశనే మిగిల్చిందనే చెప్పాలి. ఈ కథను చాలా మంది తెలుగు హీరోలు తిరస్కరించారని, పవర్ ఫుల్ స్టోరీ కావడం వల్లే ఇలా జరిగిందని అజయ్ భూపతి చెప్పుకొచ్చాడు.
అయితే ఫైనల్గా వచ్చిన ఫలితం మాత్రం లోపల రొటీన్ కథ మాత్రమే ఉందనే వాస్తవాన్ని నిరూపించిందని డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. కొంతకాలంగా శర్వానంద్ నటించిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలన్నీ ప్లాప్స్ గా నిలిచాయి. మహాసముద్రం, జాను, శ్రీకారం, పడి పడి లేచె మనసు, రాధ సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. శతమానం భవతి, మహానుభావుడు తప్ప మిగిలిన సినిమాలు అంతగా ఆడకపోయినా ఆఫర్ల విషయంలో మాత్రం ఎక్జయిటింగ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. శర్వానంద్ మాత్రం హిట్టు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది.
తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉన్న నేపథ్యంలో శర్వానంద్ ఈ సారి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హిట్టు అందుకోవాలని, లేకుంటే అతడి కెరీర్పై చాలా ప్రభావం పడుతుందని పలువురు సినీ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు, టైం ట్రావెల్ మూవీ ఒకే ఒక జీవితం సినిమాలు చేస్తున్నాడు. విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలు శర్వానంద్ కెరీర్కు ఏ స్థాయిలో ప్లస్ అవుతాయో చూడాలి మరి.