టాలీవుడ్ (Tollywood)యువ హీరో శర్వానంద్ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు, శ్రీ కార్తీక్ (Shree Karthick)డైరెక్షన్లో ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కాగా వీటిలో ఒకే ఒక జీవితం చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు శర్వానంద్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు.
మేకర్స్ శర్వానంద్, వెన్నెల కిశోర్, ప్రియదర్శితో స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. సినిమా టీజర్ డిసెంబర్ 29న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వినోదానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే వెన్నెల కిశోర్, ప్రియదర్శి లాంటి క్రేజీ యాక్టర్లతో శర్వానంద్ ఫుల్ ఎంటర్ టైన్ అందించడం పక్కా అని తాజా పోస్టర్తో తెలిసిపోతుంది.
ముగ్గురూ ఊయలపై కూర్చొని నవ్వుతూ కనిపిస్తుండగా..బ్యాక్ డ్రాప్లో గాలిపటం, టోపీ, పాత టేప్ రికార్డర్, క్యాసెట్, రిమోట్ లాంటి వస్తువులున్నాయి. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోండగా..శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని నటిస్తోంది. ఫిబ్రవరిలో గ్రాండ్గా విడుదల కాబోతుంది.