విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (Puri Jagannadh). పూరీ జగన్నాథ్ (liger)దర్శకత్వం వహించాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫెయిల్యూర్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కోలుకోలేనంత నష్టం తెచ్చిపెట్టినట్టు ఇప్పటికే వార్తలువచ్చాయి.
ఈ నేపథ్యంలో నిర్మాతలైన ఛార్మీ, పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం పంపిణీ మొదలుపెట్టినట్టు కొన్ని కథనాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆడియో ప్రకారం పూరీ, ఛార్మీ ఇంకా వారికి నష్టపరిహారం చెల్లించలేదట.
తాజా కథనాల ప్రకారం డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది ఛార్మీ(Charmee)ని నష్టపరిహారం కోసం డిమాండ్ చేయగా.. పూరీ పేరుకు మచ్చతెచ్చేలా ప్రయత్నిస్తున్న కొందరు డిస్ట్రిబ్యూటర్లపై సీరియస్ అయిందని టాక్ నడుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు తమ(పూరీ, ఛార్మీ)కు కొంత సమయం కావాలని అడిగినట్టు ఆడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు పూరీ.
నా పరువు తీయాలని చూస్తే మాత్రం..ఆడియోలోని మాటలు ఇలా..
‘మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా..? నేను ఎవరికీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకిస్తున్నా.. పాపం వాళ్లు కూడా నష్టపోయారనే సానుభూతితో మాత్రమే తిరిగివ్వాలనుకుంటున్నా. కొంత మొత్తాన్ని ఒక నెలలో ఇస్తానని ఇప్పటికే బయ్యర్లతో మాట్లాడాను. వాళ్లు ఒప్పుకున్నారు. వాళ్లను ఒక నెల టైం అడిగాను. నాకు కూడా రావాల్సింది ఉంది. ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే.. ఇచ్చేది కూడా ఇవ్వబుద్ది కాదు. మేము ఎందుకిస్తున్నాం.. పరువు కోసం ఇస్తున్నాం. కానీ నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అయినా ఎగ్జిబిటర్స్ కు నాకు సంబంధం ఏంటీ ’ అంటూ పూరీ స్టైల్లో సాగుతున్న వార్నింగ్ వాయిస్ కాల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్స్ర్కైబ్ ట్రైలర్
Read Also : Chiranjeevi | బ్రిటీష్ వారికి భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు: చిరంజీవి
Read Also : ఆ 20 నిమిషాలు స్టన్ అయిపోయా.. కాంతారపై పూజా హెగ్దే రియాక్షన్