బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత ప్రజలంతా దీపావళి సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రిషి సునాక్ను అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. రిషి సునాక్ (Rishi Sunak) బ్రిటన్ ప్రధాని అవడం పట్ల తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi ) హర్షం వ్యక్తం చేశారు.
‘భారతదేశం బ్రిటీష్ (ఆంగ్లేయులు)వారి నుండి స్వాతంత్య్రం పొంది 75 ఏండ్లు జరుపుకుంటున్న వేళ.. బ్రిటిష్ వారు భారతీయ సంతతికి చెందిన ఒక ప్రధానమంత్రిని.. అది కూడా మొట్టమొదటి హిందూ ప్రధానిని పొందుతారని ఎవరు ఊహించారు.. ’అంటూ ట్వీట్ చేశాడు చిరంజీవి. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్ను దీపావళి కానుకగా విడుదల చేయగా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇది తన జీవితంలో గొప్ప అవకాశం.. బ్రిటీష్ ప్రజలకు అను నిత్యం సేవ చేస్తానని బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆ దేశ ప్రజలను ఉద్దేశించి రిషి సునాక్ చేసిన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ దేశానికి సేవ చేసేందుకు తన జీవితంలో లభించిన అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
Who would have thought when India celebrates 75 years of Independence from the British, the British will get a Prime Minister of Indian origin, a first ever Hindu PM #RishiSunak #LifeComesFullCircle #India
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్స్ర్కైబ్ ట్రైలర్
Read Also : ఆ 20 నిమిషాలు స్టన్ అయిపోయా.. కాంతారపై పూజా హెగ్దే రియాక్షన్