టాలీవుడ్ (Tollywood)యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా (Ori Devuda). అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు.
ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..’రాంచరణ్లా క్రమశిక్షణగా ఉండేందుకు ప్రయత్నిస్తా. నాకు కొంచెం అదొక్కటే తక్కువ. రాంచరణ్ను దగ్గర నుంచి చూశాను కాబట్టి..ఇప్పటినుంచి ఆయనలా ఉండేలా చూసుకుంటా. నా మొదటి సినిమా ఫలక్నుమా దాస్ ఈవెంట్కు నాని అన్న వచ్చారు. అలాగే వెంకటేశ్ గారు ట్రైలర్ లాంఛ్ చేశారు. ఆయన అడగ్గానే నాకు ఈ సినిమాలో దేవుడి పాత్ర చేశారు. ఇపుడు రాంచరణ్ వచ్చారు. జీవితంలో ఈ విషయాన్ని మర్చిపోలేనన్నాడు’ విశ్వక్ సేన్.
అశ్వత్ మారిమత్తు చాలా అద్భుతమైన కథ రాశారు.అశ్వత్ మారిముత్తు ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలుస్తారని చాలా గర్వంగా చెబుతున్నా. మ్యూజిక్ డైరెక్టర లియోన జేమ్స్ కూడా ఇండియాలో వన్ ది టాప్ పొజిషన్లో ఉంటారు. ఓరి దేవుడా సినిమా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది. దీపావళికి మూడు రోజుల ముందే సినిమా వస్తుంది. రిపీట్ ఆడియెన్స్ ఉంటారన్నాడు విశ్వక్ సేన్.
ఈ చిత్రంతో బాలీవుడ్ భామ మిథిలా పాల్కర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. వెంకటేశ్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓరి దేవుడా చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్లో నిజమెంత ?
Read Also : Yashoda | డేట్ను రౌండప్ చేస్తూ.. యశోద సినిమా విడుదలపై సమంత టీం హింట్ ..!
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క