తాను హిందీ హీరోనని..ఇతర యాక్టర్లలాగా తెలుగు సినిమా కానీ, ఇతర భాషా సినిమాలు కానీ చేయబోనని జాన్ అబ్రహాం (John Abraham) చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన విషయం తెలిసిందే. దక్షిణాది చిత్రాలపై చేసిన కామెంట్స్ పై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఇదిలా ఉంటే జాన్ అబ్రహాం తాజాగా ఓటీటీపై చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఓ ఇంటర్వ్యూ లో మీరు ఓటీటీ షోలు చేస్తారా..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జాన్ అబ్రహాం స్పందిస్తూ…’నేను ఓటీటీ షోస్ కటౌట్ కాదు..సిల్వర్ స్క్రీన్ హీరో. ఇందులో ఎలాంటి తప్పులేదు. నేను ఓటీటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని అనుకోవడం లేదని’ చెప్పాడు. ఓటీటీ ప్లాట్ ఫాంలపై సెటైరికల్ గా చేసిన కామెంట్స్ పై ఎలాంటి రియాక్షన్ వస్తాయో చూడాలి మరి.
జాన్ అబ్రహాం హీరోగా లక్ష్య ఆనంద్ డైరెక్ట్ చేసిన ఎటాక్ ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez), టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందన కరువైంది. ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్తో గట్టి పోటీ ఏర్పడినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. మోహిత్ సూరి డైరెక్షన్లో ఏక్ విలన్ సినిమాలో నటిస్తున్నాడు జాన్ అబ్రహాం. దీంతోపాటు షారుక్ ఖాన్ నటిస్తోన్న పఠాన్ లో కీ రోల్ పోషిస్తున్నాడు.