VishwakSen | రెండు తెలుగు రాష్ట్రాలను (two Telugu states) భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు.
In these devastating times of calamity, I am pledging a donation of ₹5 lakhs to the Andhra Pradesh CM Relief Fund to support the flood relief efforts in the state. This contribution is a small step towards alleviating the suffering of those affected by the floods.…
— VishwakSen (@VishwakSenActor) September 3, 2024
తాజాగా సినీ హీరో విశ్వక్సేన్ (VishwakSen) రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ.10లక్షలు విరాళంగా ప్రకటించారు. తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు.
In these devastating times of calamity, I am pledging a donation of ₹5 lakhs to the Telangana CM Relief Fund to support the flood relief efforts in the state. This contribution is a small step towards alleviating the suffering of those affected by the floods.@revanth_anumula…
— VishwakSen (@VishwakSenActor) September 3, 2024
ఇక అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ సైతం తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
— Jr NTR (@tarak9999) September 3, 2024
Also Read..
Tirumala | తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం
Sai Pallavi | పదేండ్లుగా ఆయన్ని ప్రేమిస్తున్నా!: సాయిపల్లవి
Cow Smuggler: గోవుల స్మగ్లర్ అనుకుని.. 30 కిలోమీటర్లు ఛేజ్ చేసి.. విద్యార్థిని కాల్చి చంపారు